చోడవరం లో శ్రీ నూకాంబికా కళ్యాణ మండపం లో దివంగత సేవ తపస్వి పునీత్ రాజ్ కుమార్ 51వ జయంతి సందర్బంగా సంఘ ప్రెసిడెంట్ గొలుకొండ గణేష్ ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛంద రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధిగా చోడవరం విద్యుత్ ఏడిఈ వై సురేష్ కుమార్,కాళ్ల వెంకట రమణ మూర్తి, సింగంపల్లి రవికుమార్, హాజరు అయ్యారు. మొత్తం 71 యూనిట్స్ బ్లడ్ సేకరణ జరిగింది. ఇది ఐదోసారి నిర్వహించడం జరిగిందని సంఘ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తప్పెట్ల గణేష్ కుమార్ , సాంబారి శ్రీను, పప్పు రాజు,అనిల్,యుగంధర్, దాసు, శ్రీను, పవన్, ప్రసాద్, సాయి, అధిక సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు పాల్గున్నారు.
