ఉత్తరాంధ్ర జిల్లాల బిజెపి మహిళా మోర్చా జోనల్ ఇన్చార్జిగా మాడుగులకు చెందిన మండల సంతోషి సుబ్బలక్ష్మి నియమిస్తూ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు నిషిధ రాజు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మహిళా మోర్చా రాష్ట్ర కమిటీలో 24 మంది సభ్యులను నియమించగా వారిలో మాడుగుల సుబ్బలక్ష్మినీ ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా నియమిస్తూ ప్రాధాన్యత కల్పించడం పట్ల స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఈమె పార్టీలో పలు పదవులు నిర్వహించారు. తనపై నమ్మకంతో ఉత్తరాంధ్ర బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు టివిఎన్ మాధవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిద రాజు కి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
బిజెపి మహిళా మోర్చా జోనల్ ఇన్చార్జిగా సుబ్బలక్ష్మి
RELATED ARTICLES
