Home Politics Andhra Pradesh క్షత్రియ కళ్యాణ మండపంలో శ్రీరామనవమి వేడుకలు..

క్షత్రియ కళ్యాణ మండపంలో శ్రీరామనవమి వేడుకలు..

0

శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతమ్మధారలోని క్షత్రియ కళ్యాణ మండపంలో సిరి వెంకటేశ్వర డెవలోపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కె.కె రాజు దంపతులు, సుదర్శన రాజు దంపతులు, మరియు క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా శ్రీ కె.కె రాజు గారు దంపతులు, సుదర్శన రాజు దంపతులు పాల్గొని శ్రీ సీతారాముల వారి కల్యాణమహోత్సవమును అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కె.కె రాజు మీడియాతో మాట్లాడుతూ.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు,ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర మూర్తుల వారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించడం ఎంతో విశేషమని పేర్కొన్నారు.
ఈ కల్యాణ మహోత్సవంలో
క్షత్రియ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ తిరుపతి రాజు,ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు,యన్.శ్రీనివాసరాజు,విసి జి.యస్.యన్ రాజు,యం.ఆర్.కె రాజు,సి.హెచ్ వెంకటపతిరాజు,క్షత్రియ సంక్షేమ సమితి పెద్దలు,యువకులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version