రామ్ జయంతి వేడుకలు
మండలంలోని సీతియ్యపేట యస్ సి కొలనీ లో ఘనంగా బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వజ్రపు ఇంద్రరా శ్రీనివాస్ మాజీ సర్పంచ్ కరణం నాగేశ్వరరావు జనసేన ఇంచార్జ్ తాలపురెడ్డి రాజు ముఖ్యాతిదులుగా విచ్చేశారు .ఈ సందర్భంగా సర్పచ్ ఇందిరా శ్రీనివాస్ మాట్లాడుతూ బాబూ జగజ్జీవన్ రామ్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దళితుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన ఇంచార్జీ తల్లపురెడ్డి రాజు,
గ్రామం మాదిగ దండోరా సేవా సంఘం సభ్యులు అధ్యక్షుడు గంపల రమణ, సెక్రటరీ గంపల రాజు (యేసు), ఉపాధ్యక్షులు గంపల శివ, కోశాధికారి కోరిబిల్లి ఆనంద్, జాయింట్ సెక్రటరీ కాండ్రకోట శ్రీను పలువురు సభ్యులు పాల్గొన్నారు
