Home News ప్రభుత్వం ప్రజా అవసరాలను తీర్చడమే ధ్యేయం

ప్రభుత్వం ప్రజా అవసరాలను తీర్చడమే ధ్యేయం

0

రెవెన్యూ పెట్రోల్ బంకును ప్రారంభించిన అచ్చన్న

రాష్ట్రంలో ప్రజా అవసరాలను సంక్షేమాలు ముఖ్య అవసరాలు తీర్చడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు స్పష్టం చేశారు.

టెక్కలి సమీపంలోని జగతిమెట్ట వద్ద నిర్మించిన రెవెన్యూ శాఖ పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు, వాహనదారుల కు మంచి నాణ్యమైన ఇంధన సేవలను అందించడం మన బాధ్యతని, ప్రజల మన్ననలను పొంది ఈ బంకు ద్వారా సరియైన సేవలు అందించాలని మంత్రి సూచించారు.

టెక్కలి రెవెన్యూ శాఖ బంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ , టెక్కలి ఆర్ డి ఓ ఎం కృష్ణమూర్తి కోటబొమ్మాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బ గాది శేషగిరిరావు, మాజీ పిఎసిఎస్ కమిటీ చైర్మన్ కింజరాపు హరిప్రసాద్, ఐ ఓ సి ఎల్ విశాఖ విశాఖ డివిజన్ సీనియర్ మేనేజర్ ఎన్ రాజీవ్ కుమార్, ఇంజనీర్ ప్రశాంత్ అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version