చోడవరం మండలం, దుడ్డుపాలెం గ్రామ శివారు లో పేకాట ఆడుతున్నారన్న స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చిన సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేశారు. చోడవరం పోలీస్ సిబ్బంది జరిపిన దాడిలో పేకాట ఆడుతున్న 18 మంది ముద్దాయిలను పట్టుకొని వారి వద్ద నుండి 98,880 రూపాయలు డబ్బులు, 52 పేక ముక్కలు, 17 సెల్ ఫోన్లు, 15 గేమ్ కాయిన్స్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
