ఫిబ్రవరి 28 సైన్స్ డే సందర్బంగా అండమాన్ కొండయ్యవలస శ్రీ విజ్ఞాన్ బ్రిలియంట్ స్కూల్ లో సైన్స్ ఎగ్జిబిషన్ మహాత్మాగాంధీ మదర్ తెరిసా అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ ప్రారంభించి, కీర్తిశేషులు సివి రామన్ చిత్రపటానికి పూలతో జ్యోతి ప్రజ్జాలను చేసి విద్యార్థులు తయారుచేసిన 110 స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకమైన నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎంతో దోహదపడతాయని సోలార్ పవర్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, స్వచ్ఛ పరిశుభ్రత, ఆరోగ్యవంతంగా ఉండడానికి తీసుకుని చర్యలు ఇంకా ఎన్నో సమాజానికి ఉపయోగపడే ప్రదర్శనను చూసి ఆమె విద్యార్థులను అభినందించారు. స్కూల్ కరస్పాండెంట్ కె వి సత్యనారాయణ కార్యక్రమంలో బలిరెడ్డి సత్యనారాయణ ప్రిన్సిపాల్ కెవి పద్మావతి నెక్స్ట్ అకాడమీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ ఆముదారావు వాసుదేవరావు, సాయి విద్యానికేతన డైరెక్టర్ లక్ష్మణరావు, ప్రియదర్శిని స్కూల్ డైరెక్టర్ ప్రియ ప్రసాద్, రంగనాథ్, అప్పారావు, శివయ్య ఫౌండేషన్ ఇంచార్జ్ కె.వి ప్రసాద్
మరియు విద్యార్థులు తల్లితండ్రులు పాల్గొన్నారు.
