చోడవరంకి చెందిన చలపతి ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగా బుధవారం సాయంత్రం మాడుగుల మండలం కోటపాడు ప్రాంతంలో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు.రోజు మాదిరిగానే పాఠశాల విడిచిన తర్వాత చోడవరం నుండి విద్యార్థులను తిరిగి ప్రయాణంలో పిల్లలను చేర్చుతున్న సమయంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్తు సిమెంట్ స్తంభాలపై నుంచి పంట పొలాల్లోకి దూసుకు వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న మాడుగుల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోనీ డ్రైవర్ని అదుపులోకి కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
