Wednesday, February 11, 2026
HomeUncategorizedదేవరాపల్లిలో పెన్షన్ లు పంపిణీ

దేవరాపల్లిలో పెన్షన్ లు పంపిణీ

దేవరాపల్లి, జయజయహే : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. మాజీ ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి భాస్కరరావు, సర్పంచ్ సబ్బవరపు పెంటమ్మ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ దారులకు నగదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయోవృద్ధులకు, వితంతువులకు, ప్రత్యేక ప్రతిభావంతులకు, ఒంటరి మహిళలకు వీరి జీవితాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనంత ఉమాదేవి, వీఆర్వో బి. నాగేశ్వరరావు,ఎంపీటీసీ మొల్లి కృష్ణమూర్తి, వార్డ్ మెంబర్ దీవి శంకర్రావు, ఎంపీపీ స్కూల్ కమిటీ చైర్మన్ వంజంగి సూర్యనారాయణ, సబ్బవరపు మాలి బాబు, గవిరెడ్డి సింహ, అల్లు దేవుడు నాయుడు, సబ్బవరపు శివ శంకర్, అల్లు ఆబద్దం, కిలాడీ జ్వాలా తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments