Home Politics Andhra Pradesh చోరీ కేసులో న్యాయం చేయాలని మహిళ విజ్ఞప్తి

చోరీ కేసులో న్యాయం చేయాలని మహిళ విజ్ఞప్తి

0

రాజమహేంద్రవరం తాడితోట ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి నాగభవాని తనకు జరిగిన చోరీ ఘటనపై న్యాయం చేయాలని సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు. నెల రోజుల క్రితం తన సెల్ ఫోన్ , కొంత నగదు చోరీకి గురైనట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చోరీ ఘటనపై అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లను కూడా పోలీసులకు వివరంగా చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అడిగినా సమస్య పరిష్కారానికి స్పష్టమైన స్పందన లభించలేదని తెలిపారు.
రాజమహేంద్రవరం నగరంలోని ఒక బ్లడ్ బ్యాంక్‌లో స్వల్ప జీతంతో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న తాను ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని నాగభవాని పేర్కొన్నారు. తాను ఒంటరి మహిళనని, తనకు తోడుగా నిలిచే కుటుంబ సభ్యులు ఎవరూ లేరని భావోద్వేగంగా తెలిపారు.
ఈ పరిస్థితుల్లో తనకు జరిగిన చోరీ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి దర్యాప్తు వేగవంతం చేసి తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే తన ఫిర్యాదుపై త్వరితగతిన చర్యలు తీసుకుని చోరీకి బాధ్యులైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version