మాజీమంత్రి ఎర్రన్న జయంతి నివాళులు
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మడ గ్రామంలో మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రం నాయుడు ఘాట్ వద్ద కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సారధ్యంలో ఎర్రన్న 69 జయంతి నివాళులు కుటుంబ సభ్యులు, అభిమానులు కార్యకర్తలు నిర్వహించారు.
ప్రజా శ్రేయస్సు కోసం ఎర్రన్న చేసిన సేవలు మరువలేమని
ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని పలువురు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తోపాటు మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు కింజరాపు హరి వరప్రసాద్, ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డి కింజరాపు ప్రభాకర్, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాస్ నాయుడు, కుటుంబ సభ్యులు, అభిమానులు , కార్యకర్తలు, గ్రామస్తులు, పాల్గొన్నారు.
