తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి మాజీ మంత్రి,రాజ్యసభ సభ్యులు, టి ఎస్ ఆర్ సేవ పీఠం ఆధ్వర్యంలో భారత యజ్ఞపీఠం, కాకినాడ సంయుక్తంగా ఆదివారం,మహాశివరాత్రి సందర్భంగా రామకృష్ణ బీచ్ విశాఖనగరం నందు 41వ మహా కుంభాభిషేకం. సాగరం ఒడ్డున కోటి ఎనిమిది లక్షల శివ లింగాలకు మహా కుంబాభిషేకం . మహావిశాఖ నగరలో లోక కళ్యాణార్థం ప్రజల శ్రేయస్సు కోరుతూ విశాఖ నగర సశ్యామలంగా ఉండాలని, నగర ప్రజలకు ప్రకృతి నుండి ఎటువంటి ప్రమాదాలకు లోనుకోకుండ ఉండుటకు మహా కుంభాభిషేకం ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలియ జేశారు . ఆదివారం ఉదయం 7.38 ని. లకు శ్రీ శ్రీ శ్రీ రుద్రంశ్య సంభూతులు శ్రీ వీరభద్ర స్వామి వారిచే సుబ్బిరామరెడ్డి స్వగృహములో విగ్నేశ్వర పూజతో నిర్వహించి , పరమేశ్వరునికి మహా కుంభాభిషేకం, పంచామృతం, సుగంధ ద్రవ్యాలు, పళ్ళ రసాలతో స్వామివారికి అభిషేకం , మధ్యాహ్నం ఒంటి గంటకు స్వామి వారికి ఏకాంత సేవ , 3 గంటలకు స్వామివారి కళ్యాణం, 4.30 గంటలకు హోమం పూర్ణాహుతి తదిన అనంతరం కళాబంధు డా. టి. సుబ్బి రామరెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు ప్రసంగించె దరు అని చంద్రిశేఖర్ ఉత్సవ కన్వీనర్, బి. వి రామ్ తెలుగు శక్తి అధ్యక్షులు టిఎస్ఆర్ సేవ పీఠం ప్రతినిధులు పత్రిక సమావేశం తెలియజేశారు.
