Wednesday, February 11, 2026
HomePoliticsAndhra Pradeshమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని కొనసాగించాలి.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని కొనసాగించాలి.

జీ రాంజీ పధకాన్ని రద్దు చేయాలి. మండలకేంద్రాలలో సిపిఎం పార్టీ ఆద్వర్యంలోని జరిగే దర్నాలను జయప్రదం చేయ్యండి. సిపిఎం పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శి పి. అప్పలనర్స పిలుపునిచ్చారు.కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏకపక్షంగా మార్పు చేసి, జీ రాంజీ పధకాన్ని ప్రవేశ పెట్టడం దుర్మార్గం. గిరిజన, పేద, దళిత వర్గాలకు ఎంతగానో ఉపయోగ పడే చట్టాన్ని పెట్టు బడిదారుడు, భూ స్వామి వర్గాల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నారనీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న తొంబై శాతం వాటాను కుదించి అరవై శాతం వరకు చెల్లించాలనీ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోని మొత్తం నిధులు కేంద్రమే భరించాలి.ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయడానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహారిస్తుంది. వామపక్ష పార్టీలు పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి చట్టాన్ని తుంగలో త్రొక్కుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కనీస కూలి ఆరు వందలు చెల్లించాలి. పని ప్రదేశాలో కనీస సౌకర్యాలు కల్పించాలి. పని దినాలు రెండు వందలు రోజులు పెంచాలి. ఇప్పటి వరకు బకాయి పడ్డ నిధులు విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్బీ. పోతురాజు, సిపిఎం మండల నాయకులు పాంగి. సురేష్ కుమార్, పాంగి. సత్యనారాయణ తామర్ల. సూర్యనారాయణ, పాంగి. డొంబు,గసబ సర్పంచ్ పాంగి. సునీత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments