Home Politics Andhra Pradesh ప్రశాంతి నిలయంలో వైభవంగా శ్రీ సీతారామ కల్యాణం

ప్రశాంతి నిలయంలో వైభవంగా శ్రీ సీతారామ కల్యాణం

0

పవిత్రమైన శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. సాయి కుల్వంత్ హాల్లో నిర్వహించిన ఈ దివ్య కార్యక్రమం వేద మంత్రోచ్చారణలు, భక్తి గీతాల మధ్య, దేశ విదేశాల నుంచి విచ్చేసిన వేలాది భక్తుల సమక్షంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. భగవాన్ వారి భౌతిక సాన్నిధ్యంలో ప్రారంభమైన ఈ సంప్రదాయం నేటికీ అదే పవిత్రతతో కొనసాగుతూ, ధర్మం మరియు పవిత్రత యొక్క దివ్య కలయికను సూచిస్తుంది. కార్యక్రమంలో గణపతి పూజ, నవగ్రహ పూజ, మంగళ్యధారణ వంటి శాస్త్రోక్త విధానాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంవత్సర వేడుకల ప్రత్యేక ఆకర్షణగా భక్షణ సమర్పణం నిలిచింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు కలిసి 300కు పైగా రకరకాల నైవేద్యాలను భక్తి భావంతో సమర్పించారు. అలాగే తలంబ్రాలు తయారీ కూడా ఎంతో విశేషంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని 31 జిల్లాల భక్తులు ఈ సేవలో పాల్గొని, స్వయంగా తొక్క తొలగించి, పవిత్రతతో బియ్యాన్ని సిద్ధం చేసి సమర్పించారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించిన శ్రీరామచంద్ర స్వామి, సీతాదేవి విగ్రహాలు దివ్య కాంతిని వెదజల్లుతూ, ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసరింపజేశారు. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ , హిమవాహ్ని రత్నాకర్, ఇతర ట్రస్టీలు వందలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version