పాడేరు నవంబర్ 27:( జయ జయహే)
అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో జి సి సి చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి బాకూర్ సర్పంచ్ బాకుర్ వెంకటరమణ, టిడిపి డివిజన్ నాయకులు, దారేలా సర్పంచ్ పాంగి పాండురంగస్వామి, శోభకోట సర్పంచ్ శశిభూషణ్ నాయుడు, మాజీ జడ్పిటిసి సుబ్బారావు, టిడిపి ప్రధాన కార్యదర్శి జగత్, వనమాసింగి సర్పంచ్ లక్ష్మణ్, మాజీ సర్పంచ్ వాసుదేవ్, ఎంపిటిసి కొమ్మరమ్మ కళావతి, మహిళా నాయకురాలు నిర్మల, బుజ్జిబాబు, అచ్చిబాబు, భూషణం రావు, జనసేన నాయకులు కోటి, చిన్ని, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
