పారిజాతగిరి ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం
……….
చైర్మన్ గాఅల్లూరి రామకృష్ణ,
11 మంది ధర్మకర్తల నియామకం
………
జంగారెడ్డిగూడెం,
జయ జయ హే
స్థానిక గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ నూతన కమిటీ చేత ప్రమాణం చేయించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కలగర శ్రీనివాసు నూతన ధర్మకర్తల మండలి లోని 12 సభ్యులును పరిచయం చేశారు.నూతన పాలక లో ప్రభుత్వం 11సభ్యులను నియమించగా -12వ ఎక్స్ అఫీషియోమెంబర్ గా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు ను నామినేట్ చేశారు. వీరితో ఎమ్మెల్యేరోషన్ కుమార్ ప్రమాణం చేయించారు. చైర్మన్ గా అల్లూరి రామకృష్ణ పేరును సభ్యులు కొప్పుల నాగ సురేంద్ర, వడిగల లోవ కుమారి తదితర సభ్యులు ఏకగ్రీవంగా బలపరచారు.చైర్మన్ అల్లూరి రామకృష్ణ ధర్మ కర్తలు కన్నా కృష్ణ ఆరేపల్లి నాని,కొప్పుల నాగ సురేంద్ర ,అన్నాప్రగడ వీర రాఘవులు మాదిగిని ప్రియాంక ,ముప్పిడి భాను ,సత్యవాడ దివ్య ప్రసన్న ,దండు భవాని వెంకటలక్ష్మి,వడిగలలోవ కుమారి, , మడ్డి ప్రసాద్ ,నల్లూరి రవికుమార్ ఆచార్యులు నియమితులయ్యారు.
కార్యక్రమం లో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచర్ల జగపతి రాజు అబ్బిన దత్తాత్రేయ, ఇళ్ల రామ్మోహన్రావు, దండు ధనరాజు కర్పూరం జనార్దన్, తెదేపా నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, షేక్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
