చినముసిడివాడ గౌరి సంక్షేమi సంఘం భవనం లో 95, 97 వార్డు బిజెపి మండల అధ్యక్షులు చిక్కాల సతీష్ ఆధ్వర్యంలో ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతరం గీతంతో ప్రశక్షణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కె. సురేంద్రమోహన్, పెందుర్తి నియోజకవర్గం ప్రశిక్షణ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, 95 వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ బిజెపి పార్టీ స్థాపించినప్పటినుండి ఇప్పటివరకు జరిగిన సంఘటనలను వివరించారు. రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్ మాట్లాడుతూ ఈ ప్రశిక్షణ 8 కాలాంశాలతో కూడుకొని ఉంటుంది. మూడు సంవత్సరాలకు ఈ ప్రశక్షణ జరుగుతుంది అలాగే కొత్తగా పార్టీ లోకి వచ్చినటువంటి వారందరికీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విధానం తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు. పెందుర్తి నియోజకవర్గం ప్రశిక్షణ మహా అభియాన్ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు మాట్లాడుతూ ఈ ప్రశిక్షణ ద్వారా కార్యకర్తలు బిజెపి సిద్ధాంతాలను అవగతం చేసుకొని ప్రజలకు వివరించి పార్టీ ని బలోపేతం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త నాయకులకు చూచించారు. స్థానిక కార్పొరేటర్ ముమ్మన దేముడు అందరూ శ్రద్ధగా 8 కాల అంశాలను గ్రహించి నోట్స్ తీసుకొని ఈ ప్రశిక్షణ ను ఉపయోగించుకొని పార్టీ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి బాలసుబ్రమణ్యం బిజెపి శక్తి కేంద్ర ప్రముఖులు, కార్యవర్గ సభ్యులు, మండల పదాధికారులు, మహిళలు తో పాటు 120 మంది పాల్గొన్నారు.
ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం
RELATED ARTICLES
