Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshరూ.37, 899 కోట్ల పెట్టుబడులకు ఓకే

రూ.37, 899 కోట్ల పెట్టుబడులకు ఓకే

రూ.37, 899 కోట్ల పెట్టుబడులకు ఓకే

ఐటీ, విద్యుత్, టూరిజం ఫుడ్ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్లు

ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉండవల్లి క్యాపు కార్యాలయంలో బుధవారం 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. ప్రధానంగా వివిధ రంగాలకు చెందిన కంపెనీల పెట్టుబడులపై మాట్లాడారు. మొత్తం రూ.37, 899 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 56,692 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన వివిధ పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీలో ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, పి.నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాశ్, సీఎస్ కె.విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments