ప్రభుత్వ 118 జీ ఓ తో విద్యార్దుల్లో ఆందోళన
ఏ ఎఫ్ అర్ సి పెద్దలే సరి చేయాలి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిధిలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు న్యాయంగా తమ ఆవేదన తెలియజేశారు, అయితే యాజమాన్యానికి కొత్త ఫీజుల జీవో నెంబర్ 118 ను ఏ ఎఫ్ ఆర్ సి , అడ్మిషన్ మరియు ఫీజులు నియంత్రణ కమిటీ ,ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రతి మూడేళ్లకోసారి జారీ చేసిన నిబంధనలతో ఆయా కళాశాలల్లో యాజమాన్యాలు విద్యార్థుల వద్ద నుంచి ఫీజులు వసూలు జరుగుతుంది.
ప్రస్తుతం ఈ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులరిటీ అండ్ మో నట్రింగ్ కమిషన్ నిర్వహణలో ఉంది, ఈ కమిషన్ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పా ర్మసి, ఫీజులు, ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించేందుకు పరివేక్షణ చేస్తారు, ప్రభుత్వం ఫీజులు చెల్లించే విద్యార్థులకు వికాకుండా , ఉద్యోగుల విద్యార్థుల కు మాత్రమే ఈ ఫీజుల వ్యవహారం ఉంటుంది, దీనిపై కొన్ని ప్రవేట్ కళాశాలలో న్యాయస్థానాలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి,
ఈ కొత్త జీవో వల్ల కొంతమంది విద్యార్థులు అయోమయంలో ఉన్నప్పటికీ జీవోలో మార్పులు జరిగితే కట్టిన ఫీజులను తిరిగి చెల్లిస్తామని ఐతం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
కళాశాలలో విద్యార్థులు యాజమాన్యాలకు మధ్య సమాచార లోపo తోనే ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయని, కళాశాల యాజమాన్యాలు సంబంధిత సర్కులర్లు విద్యార్థులకు జారే చేసే ముందు విద్యార్థులతో కళాశాల సమావేశాల సమయంలో ప్రభుత్వం అమలు చేసే జీవోలను సమగ్రంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది, కళాశాల వద్ద సామాజిక, అభివృద్ధి, కళాశాల ప్రగతి సమాచారాలను పార దర్శకంగా ఉంచాలని, అలాగే మీడియాకు సమన్వయ కలిగిన జవాబుదారితనం చాలా అవసరమని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ,పలువురు విద్యావేత్తలు, సూచిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
