భక్తుల హోరు తో శివాలయాల్లో సందడి ,మహాశివరాత్రి మహోత్సవాలకు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని శివ క్షేత్రాలు భక్తుల రాకడ కోసం సర్వం సిద్ధం చేశారు, అధికారులు, ఆలయ కమిటీలు, శివనామ స్మరణంతో చిన్న పెద్ద భక్తులు సుదూర ప్రాంతాల నుంచి జిల్లాలో ఉన్న ప్రముఖ శివ క్షేత్రాలను సందర్శించి భక్తి శ్రద్ధ ల తో తమ మొక్కలు చెల్లించుకో నున్నారు . చారిత్రాత్మకమైన సుప్రసిద్ధ శివాలయాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి, మహాశివరాత్రి జాగరాలతో పాటు, కార్తీక మాసంలో ఈ శివాలయాల్లో భక్తుల కోలాహనం ఉండి నిత్యం పూజలు అందుకుంటున్న శైవ క్షేత్రాలు శ్రీముఖలింగలోని శ్రీ ముఖలింగేశ్వర స్వామి, శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి శ్రీకాకుళం, శ్రీ ఎండల మల్లికార్జున స్వామి, రావివలస, స్వయంభు లింగేశ్వర స్వామి, పలాస
శ్రీ నీలకంఠేశ్వర స్వామి పాతపట్నం, శివ క్షేత్రాల్లో ఆదివారం మహాశివరాత్రి జాగరణ పండగలకు ప్రభుత్వం అధికారులు భక్తుల కోసంఅన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
