Home News నందనవం సౌభాగ్య నూతన వెంచర్ భూమి పూజ ………….

నందనవం సౌభాగ్య నూతన వెంచర్ భూమి పూజ ………….

0

బ్రోచర్ ఆవిష్కరించిన ఎం డి కె కె రాజు

సిరి వెంకటేశ్వర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 24వ వెంచర్ ఆనందపురం మండలం జగన్నాధపురం లో. నందనవనం సౌభాగ్య’ పేరుతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కె కె రాజు భూమి పూజ చేసి లేఔట్ బ్రోచర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ విశాఖ రియల్ ఎస్టేట్ రంగంలో త్వరితగతిన అభివృద్ధి అవుతున్న ఆనందపురం దగ్గరలో ఈ వెంచర్ లో పెట్టుబడి పెట్టినవారు భవిష్యత్తులో మంచి లాభాలు పొందే అవకాశం ఉందని అన్నారు. తర్లువాడలో రానున్న గూగుల్ సిటీ కి సుమారు 1 కిలోమీటర్, ఐటీబీపీ అకాడమీ 1కిలోమీటర్, అలాగే ప్రభుత్వ ప్రతిపాదించిన ఆనందపురం ఐటీ సెజ్ కు 100 మీటర్లు దగ్గరలో ఈ వెంచర్ ఉందని, కావున త్వరలో ఈ ప్రాంతంలో ఇళ్ళ స్థలాలకు మంచి గిరాకి ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం 40 అడుగుల రోడ్ ఉన్న ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ 60 అడుగులుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ మార్కెటింగ్ సిబ్బంది కస్టమర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version