శ్రీ ఎరుకమాంబ అమ్మవారి మహాశివరాత్రి మహోత్సవంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ
దొండపర్తి గ్రామ దేవత శ్రీ ఎరుకమాంబ అమ్మవారి మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే వంశీ కి స్థానిక ఆలయ పెద్దలు, కూటమి శ్రేణులు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారి గర్భాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదములు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈ ఓ సురేష్ బాబు, స్థానిక కార్పొరేటర్లు లీలావతి శ్రీనివాస్, వీరారావు (బుజ్జి ) స్థానిక కూటమి నేతలు పెద్దలు శ్రీ జగదీష్, కూటమి వార్డు అధ్యక్షులు నాగమణి, b సత్యనారాయణ రెడ్డి, గోవింద్, ఈశ్వర్, కూటమి నేతలు మహేష్ , పెద్ద రాజు, సతీష్, లలిత, నాయుడు, రమేశ్, లక్ష్మణ్ ,రాజేష్ , గణేష్, గోవింద్, రాజు, పాల్గొన్నారు….
