కొంతమూరు మండలం రాజమండ్రి రూరల్ పరిధిలోని కోరుకొండ రోడ్, కొంతమూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ వారాహి దేవి పీఠం ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆజ్ఞా పీఠికతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జనవరి 26 నుంచి 28 వరకు శ్రీ సుదర్శన యజ్ఞం, హోమాలు, విశేష పూజలు జరగనుండగా, 28న ప్రత్యేక అభిషేకం, మహా మంగళహారతి నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖశాంతులు, ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆలయానికి లక్ష రూపాయల విరాళం అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవి అనుగ్రహం పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
ఆలయానికి కంబాల రూ. లక్ష విరాళం
RELATED ARTICLES
