మాడుగుల మండలం కింతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. మాడుగుల మండలంలో గల అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని వారి ప్రతిభ పాటవాలకు అనుగుణంగా ఆర్ట్ క్రాఫ్ట్ చిత్రాలు రూపొందించారు. ప్రధానోపాధ్యాయులు ఎస్ ప్రభాకర్ సిబ్బంది
ముఖ్యంగా ఈ పాఠశాల ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్స్, ఎలుగుల గంగాధరరావు, మజ్జి గంగభవాని తదితరులు పాల్గొన్నారు. వేస్టు మెటీరియల్ తో ఉపయోగ పడే మంచి అందాన్నిచ్చే వస్తువులు తయారు చెయ్యాలని గ్రామ సర్పంచ్ మైచర్ల సన్యాసినాయుడు ముఖ్య అతిధిగా విచ్చేసి విద్యార్థులు ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమoలో గ్రామ పెద్దలు స్థానికులు విద్యార్థులు పాల్గొని ప్రదర్శన తిలకించారు.
