అక్షర సేద్యం నుండి డిజిటల్ విప్లవం వైపు మారుతున్న కాలానుగా సాంకేతిక పరిజ్ఞాన పై పట్టు సాధించడం ప్రతి ఒక్కరికి అనివార్యమని శ్రీ గౌరీ గ్రంథాలయం అధ్యక్షుడు బుద్దారమనాజీ స్పష్టం చేశారు. స్థానిక గౌరీ గ్రంధాలలో సోమవారం నుంచి కంప్యూటర్ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ నేటి డిజిటల్ యోగంలో కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం అచ్ఛరాశ్యత లేకపోవడం తో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. టెన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మాత్రమే కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గౌరీ గ్రంథాలయం కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలో సాంకేతిక అంతరానీ తగ్గించాలని ఉద్దేశంతో ఈ శక్తి నా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని సర్టిఫికెట్ ఇన్ కంప్యూటర్ కాన్సెప్ట్స్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎం ఎస్ ఎక్స్ ఎల్, ఎమ్ ఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్ కాన్సెప్ట్ మొదలగు కోర్సులకు శిక్షణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు ప్రతిరోజు తీరి ప్రాక్టికల్స్ కూడా జరుగుతాయని నైపుణ్యం కలిగిన నిపుణులు ద్వారా కంప్యూటర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఈ శిక్షణ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని కాండ్రేగుల వెంకటరమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ సరగడం కిషోర్, గ్రంథాలయ సభ్యులు ప్రోగ్రాం కన్వీనర్ మల్ల బాపు నాయుడు, కాండ్రేగుల సత్యనారాయణ ఎస్ఎఫ్ఐ తదితరులు పాల్గొన్నారు
