భూసేకరణ కు మేం వ్యతిరేకం
బంగారం లాంటి మా భూములను వదులుకోమని ఇప్పటికే మూలపేట గ్రీన్ పోర్ట్కు తమ భూములు ఇచ్చామని ఇంకా అదనంగా భూసేకరణ చేయడం భావ్యం కాదని రైతులంతా తలగాo గ్రామంలో మా భూములు ఇవ్వబోమని నిరసన ర్యాలీ నిర్వహించారు.
రైతులు తమ భూముల్ని రక్షించుకోవడానికి ఐక్యమత్యంగా టెక్కలి, బన్నువాడ, అయోధ్య పురం, తలగాం, పలు గ్రామాల రైతులు పోర్టు అనుబంధ సంస్థలకు భూముల సేకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు, 100 అడుగులపోర్టు రహదారి కోసం భూములు ఇచ్చామని మళ్లీ భూములు తీసుకునేందుకు ప్రభుత్వం భూ సేకరణ చేయడం తగదని దీన్ని ఈ ప్రాంత రైతాంగం వ్యతిరేకిస్తున్న మని ఈ ప్రాంత రైతులు వ్యతిరేక నిరసనలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు కూలీలు, విశ్రాంతి ఉద్యోగులు,, గ్రామ పెద్దలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.
