మాడుగుల దేవి ఆలయంలో జరుగుతున్న కలశ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా రెండో రోజు శుక్రవారం చండీ హోమం ఘనంగా జరిగింది. ముందుగా గోపూజ నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అమ్మవారు సన్నిధిలో 16 మంది దంపతులచే చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం కూడా ప్రత్యేక హోదా కార్యక్రమాలు దాన్యాధివాసం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
