అల్లూరి జిల్లా కొయ్యురు మండల కేంద్రం లోని వారపు సంత లో కొయ్యురు సి ఐ శ్రీనివాస్,మంప ఎస్ఐ శ్రీనివాస్ మరియు సిబ్బంది కలిసి సందర్శించి అక్కడికి వచ్చిన దూర ప్రాంత గిరిజన ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు.
గంజాయి సేవనం వల్ల కలిగే దుష్ప్రభావాలు,
సైబర్ మోసాలు వాటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యత,
రోడ్డు భద్రత కోసం హెల్మెట్ ధరించాల్సిన అవసరం,
మహిళలపై జరిగే నేరాల నివారణ ప్రజలు చట్టాలను పాటిస్తూ, పోలీస్ శాఖతో సహకరించాలని, భద్రమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు.
