Home News జగన్ కు ఏబిఎన్ ఆర్ కె క్షమాపణ చెప్పాలి. ……….. …………….పెండ్ర వీరన్న

జగన్ కు ఏబిఎన్ ఆర్ కె క్షమాపణ చెప్పాలి. ……….. …………….పెండ్ర వీరన్న

0

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మహిళలను అసభ్యకరంగా ముద్రిస్తూ ఏ బి ఎన్ రాధాకృష్ణ బూతు రాతలు రాయటం జరిగింది ఆ సందర్భంగా* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున, హైదరాబాద్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి, ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆ కార్యక్రమంలో ఉన్న దళిత శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్ని, బీసీ సామాజిక వర్గానికి చెందిన శాసనమండలి సభ్యులు మరియు రాష్ట్ర ఆ పార్టీ బిసి విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాచుగుల్ల రమేష్ యాదవ్ ను , పోలీసులు దౌర్జన్యంగా మెడ మీద చేయి వేసి గెంటివేత అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది, ఈ విషయం తెలుసుకున్న *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఆ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న* పశ్చిమగోదావరి జిల్లా ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రికను క్యాలెండర్ గా మార్చి. కూటమి ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు కు ప్రసారానికి మాత్రమే ఉపయోగపడుతుందని. చంద్రబాబు నాయుడు ఆనందం కోసమే, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆ పార్టీ నాయకుల భార్యలపై అసభ్యకరమైన రాతలు రాశారని అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తున్న ఆ పార్టీ నాయకులను పోలీసులను అడ్డంపెట్టుకుని కూటమి అరాచక పాలన నడిపిస్తుందని, అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , సీఎం చంద్రబాబు నాయుడు కి వత్తాసు పలుకుతున్నారని పెండ్ర వీరన్న అన్నారు, మాజీ సీఎం జగన్ కి ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పకపోతే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెబుతుందని ఆయన హెచ్చరించారు,

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version