ఐటిడి ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీపూజా.
అల్లూరి జిల్లా జిల్లాలోని 11 మండలాలకు సంబంధించిన గిరిజన యువతీ యువకులకు 45 రోజులపాటు 120 మందికి డ్రైవింగ్ పై ఉచితంగా ఈనెల అనగా మార్చి 6 వ తేదీ నుండి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, తిరుమణి శ్రీ పూజ పేర్కొన్నారు.
సోమవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే భాగంగా అరకువేలి డిగ్రీ కాలేజ్ హాస్టల్ లో 45 రోజులపాటు 120 మందికి ఉచిత భోజన వసతి తో పాటు డ్రైవింగ్ పై అనుభవజ్ఞులతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి గల యువతీ యువకులు పదవ తరగతి పాసై వారు ఈ క్రింది 8019867264, 7287075464 నెంబర్ లకు సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఐటిడిఏ కార్యాలయానికి సమర్పించవచ్చని ప్రాజెక్ట్ అధికారి తెలిపారు.
