మాడుగుల ప్రాంత ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్య ఎట్టకాలకు మరికొద్ది రోజుల్లో పరిష్కారం కానుంది. స్థానిక ఎమ్మెల్యే బంగారు సత్యనారాయణమూర్తి ప్రత్యేక తర్వాత వడ్డాది నుంచి తాటిపర్తి వరకు 23 కోట్ల రూపాయలతో ఈ రహదారి పనులు చురుకుగా సాగుతున్నాయి. మార్చినాటికి ఈ పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. మరో 30 సంవత్సరాల వెనక్కి చూడకుండా రెండు లేయర్లతో రోడ్డు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఎం కోటపాడు కేజే పురం మధ్యలో ఈ రహదారి నిర్మిస్తున్నారు. ఇప్పటికే తాటిపర్తి నుంచి ఎం కోటపాడు వరకు రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టగా మిగిలిన రోడ్డుపన్నులు చురుకుగా సాగుతున్నాయి. గత ఏడు సంవత్సరాలు నుంచి ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకోవడంతో పాటు వాహనదారులు బాట సారులు ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు. ఈ నేపద్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ప్రజల నుంచి వత్తిడి రావడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రత్యేక దృష్టి సాధించారు. దీంతో ఈ రోడ్డుకు మహార్దశ పట్టింది. అలాగే ఘాటి రోడ్డు నుంచి మాడుగులకు కూడా రోడ్డు నిర్మించాలని మాడుగుల ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ రహదారిని కూడా అభివృద్ధి చేసి నిర్మిస్తామని ఎమ్మెల్యే బండారు ఇటీవలే ఒక సమావేశంలో ప్రకటించారు. దీంతోపాటు పాడేరు నుంచి మాడుగుల,కే కోటపాడు మీదగా విశాఖకు తక్కువ సమయంలో చేరే విధంగా మరో రోడ్డు కూడా నిర్మించడం జరుగుతాదని ఎమ్మెల్యే తెలిపారు.
