ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో కొనసాగుతున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు ముద్దాడ గణేష్ భవాని ఆదేశాల మేరకు నిడదవోలు పట్టణ బీసీ సంఘం అధ్యక్షుడిగా నానాపరపు మార్కండేయులు గారిని నియమించినట్లు వెల్లడించారు. ఈ నియామకాన్ని తూర్పుగోదావరి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు గంగుల గోపాలకృష్ణ (గోపీ యాదవ్) అధికారికంగా ప్రకటించారు.
బీసీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న మార్కండేయులు గారిపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు గోపీ యాదవ్ తెలిపారు. నిడదవోలు పట్టణంలో బీసీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మార్కండేయులు మాట్లాడుతూ, తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బీసీ సంఘం బలోపేతం, అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని, నాయకుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతానని అన్నారు.
