మానస సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మానస కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రం ను అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత టౌన్ టిడిపి ప్రెసిడెంట్ మాడుగుల పుప్పాల లక్ష్మీనారాయణ ప్రారంభించారు.
ఈ ఎండ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్రం ప్రారంభించడం ఎంతో ఆనందం దాయకమైన విషయమని ప్రజలు దాహాన్ని తీర్చే కార్యక్రమం చాలా మంచిది అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సెక్రెటరీ పరమేశ్వర రావు,ఆఫీస్ ఇంచార్జ్ యలగాడ వెంకటేష్, మానస మహాలక్ష్మి మేనేజర్ కిలపర్తి విజయ సిబ్బంది దేవి, నాగమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పక్షుల కోసం కూడా నీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
.
