*గుడిలోవ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: గంటా*
సింహాచలం, అనంత పద్మనాభ స్వామి, గుడిలోవ ఆలయాలు సర్క్యూట్ గా టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం గుడిలోవలోని ప్రాచీన శివాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. గుడిలోవ రంగనాథస్వామి, శివాలయం పరిసరాలను అభివృద్ధి చేసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 2014- 19 లో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మించామని పేర్కొన్నారు.