Home Politics Andhra Pradesh పీఎం ఉషా–జీఐఈఐ పథకం ద్వారా మహిళలకు శిక్షణ ప్రారంభం

పీఎం ఉషా–జీఐఈఐ పథకం ద్వారా మహిళలకు శిక్షణ ప్రారంభం

0

ప్రధానమంత్రి ఉషా –జీఐఈఐ పథకం లో భాగంగా 15 రోజుల టైలరింగ్ మరియు బొటిక్ సర్టిఫికెట్ కోర్సును గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మరిపాలెం లో గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. సుధ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కె. సుధ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్య శిక్షణ ఎంతో అవసరమని, టైలరింగ్ వంటి వృత్తి నైపుణ్యాలు విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు. ముఖ్యంగా బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్‌గా ఏవి. సూర్య కుమారి (మాస్టర్ ట్రైనర్ & ఫ్యాషన్ డిజైనర్) హాజరై, టైలరింగ్ ప్రాముఖ్యతను వివరించారు. కుట్టు యంత్రం నిర్వహణ, వస్త్రాల కటింగ్ వంటి ప్రాథమిక అంశాలను విద్యార్థులకు ప్రాయోగికంగా బోధించారు.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని సీఎంఎస్ ల్యాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, పాడేరు (ఏఎస్‌ఆర్ జిల్లా) ప్రిన్సిపాల్ మరియు చైర్‌పర్సన్ డా. వి. చిట్టి అబ్బాయి పర్యవేక్షణలో కార్యక్రమం సాగింది. ఈ శిక్షణకు ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా డా. పుష్ప ధనుంజయ్ , సబ్ కోఆర్డినేటర్‌గా కుమారి భువనేశ్వరి దేవి వ్యవహరించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version