ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం మాడుగుల ప్రాంత ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సోమవారం తెలిపింది. సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ప్రత్యేక దర్శనాలు అమ్మవారికి భక్తులు పసుపు కుంకుమ సమర్పణ వంటి కార్యక్రమాలతో పాటు గ్రామంలో పలుచోట్ల సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పూప్పాల అప్పలరాజు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు.
