అవగాహనతోనే మంచి అభివృద్ధి శాశ్వత అభివృద్ధికి పరిశోధనాత్మక రచన రంగాల్లో అవగాహనతో మంచి అభివృద్ధిని సాధించగలరని భావన కలుగుతుందని ధీ నికి ప్రత్యక్ష సాక్ష్యం సిఇసి విభాగానికి చెందిన అధ్యాపకులు డాక్టర్ చిదంబర రావు కారెట్ల, డాక్టర్ కిరణ్ కుమార్ పాత్రో, సంయుక్తంగా రచించిన డిజిటల్ లాజిక్ డిజైన్ పుస్తకమేనని ఐతం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
కళాశాలలో ఈ పుస్తకాన్ని ఆయన విద్యార్థులు అధ్యాపకుల మధ్యన ఆవిష్కరించారు. ఈ బుక్ వల్ల వివిధ పోటీ పరీక్షలకు మంచి అవగాహన కలిగించే విధంగా ఎంతగానో ఉపయోగపడుతుందని డైరెక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎస్ శ్రీనివాసరావు ఈసీఈ విభాగం డాక్టర్ వి అశోక్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ డిప్లమో విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు, రచయితలను అభినందించారు.
