చైర్మన్ చల్లా శంకర రావు రాజమహేంద్రవరం లోని ది ఆర్యాపురం కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో గురువారం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది కాలంలో బ్యాంక్ సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. బ్యాంక్ మెయిన్ బ్రాంచ్తో పాటు ఫోర్గేట్ బ్రాంచ్ను నూతన ప్రాంగణాలకు విజయవంతంగా షిఫ్ట్ చేయడం జరిగిందని తెలిపారు. కస్టమర్ల సౌకర్యార్థం అందుబాటు ధరల్లో బిగ్ సైజ్ లాకర్స్ హబ్ ఏర్పాటు చేయడంతో పాటు నూతన బ్రాంచ్లో ఏటీఎం సేవలను కూడా ప్రారంభించామని చెప్పారు.
ఎన్పీఏ అప్పుల వసూళ్ల కోసం SARFAESI చట్టం మరియు సహకార చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 2011–12 సంవత్సరాలకంటే ముందు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన రూ.7 కోట్ల రిఫండ్ను గతంలో రాబట్టగా, ప్రస్తుతం పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత రూ.80 లక్షల రిఫండ్ సాధించామని తెలిపారు. బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ.8,000 వరకు ఋణం మంజూరు చేస్తున్నామని, అలాగే 55 మంది పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.4,68,000 ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో బ్యాంకు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
