కోమల్లపూడిలో కాశీ విశ్వేశ్వర స్వామి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.కోనేరులో నిర్మించిన శివపార్వతుల విగ్రహాలను, ద్వాదశ జ్యోతిర్లింగాలను,సింహాద్వారం ఆవిష్కరించారు.ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు.ఆలయ ప్రాంగణం భక్తులు శివనామస్మరణతో ఆధ్యాత్మిక వెల్లివిరిసింది. ఎమ్మెల్యే రాజు,డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు,ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గేదెల సత్యనారాయణ,విగ్రహ దాతలు బుదిరెడ్డి దేముడు బాబు దంపతులు,పలువురు నాయకులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తులకు అన్నసమారాదన చేశారు.కోలాటం, తప్పెట గుళ్లు పోటీలు,ఎడ్ల పరుగుపందెం పోటీలు నిర్వహించి విజేతలకు నగదు పురష్కారం అందజేశారు.పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
