ప్రజల కష్టాలు నాకు తెలుసు మంత్రి అచ్చన్న రాష్ట్రంలో గ్రామీణ ప్రజల కనీస మౌలిక అవసరాలు తీర్చి అభివృద్ధి సంక్షేమ పథకాలను సామాన్యులకు అందజేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు తెలిపారు. ప్రజల కష్టాలు తెలిసినవాడిని గ్రామీణ స్థాయిలో ఎన్ని ఇబ్బందులు చూసి వచ్చాను కాబట్టి ప్రజా అవసరాలను తీర్చే దిశగా ప్రభుత్వం ఎప్పుడు ముందుగా ఉంటాదని ఆయన అన్నారు టెక్కలి నియోజకవర్గం నందిగాo లో రూ 12,50 లక్షల తో ఎస్సీ కాలనీ సిసి రోడ్డు ను మంత్రి కింజరాపు ప్రారంభోత్సవం చేశారు.
మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ప్రజాప్రతినిధులుగా మా బాధ్యతని ఆయన అన్నారు, ఈ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు రహదారులతో పాటు మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి అచ్చం నాయుడు స్పష్టం చేశారు.
గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
RELATED ARTICLES
