అండర్ 12 బాలురు బాలికలకు పోటీలు శ్రీకాకుళం జిల్లా స్థాయి రగ్బీ చాంపియన్షిప్ 12 ఏళ్ళ బాల బాలికలకు ఎంపికలను టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ ప్రధాన కార్యదర్శి, పొన్నాడ పార్వతీశం నిర్వహించారు.
ఈ పోటీలకు 210 క్రీడాకారులు పాల్గొనగా అందులో 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేసినట్లు రామకృష్ణ తెలిపారు. రాష్ట్రస్థాయి మినీ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ ఫిబ్రవరి 13 ,14 తేదీల్లో గుంటూరులో జరగనున్నాయని, ఇందులో ఎంపికైన క్రీడాకారులను కర్నూల్లో రగ్బీ పోటీలు ఉంటాయని వీటికోసం క్రీడాకారులకు దుస్తులు ప్రయాణ ఖర్చులు జిల్లా అసోసియేషన్ ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బాడాన నారాయణరావు, రఘునాథరావు, జయ కుమార్, ఎస్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
