విశ్రాంత ప్రిన్సిపల్ రాంబాబు విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విలువలు పెంపొందించుకోవాలని విశ్రాంత ప్రిన్సిపాల్ పి రాంబాబు సూచించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా హీర మండలం రామా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఫేర్వెల్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనీ మాట్లాడరు. అలాగే ప్రస్తుత పరిస్థితులకనుగునంగా విద్యా విధానంలో కూడా మార్పులు వస్తున్నాయని ఆ దిశగా విద్యాబోధన కూడా జరుగుతుంది కాబట్టి విద్యార్థులు వాటిని అనుసరిస్తూ పట్టుదలతో కృషి చేయాలని చెప్పారు. అలాగే తల్లిదండ్రులను అధ్యాపకులను కూడా గౌరవిస్తూ వారికి మంచి పేరు తేవాలని సూచించారు. రానున్నది పరీక్ష కాలం కాబట్టి ప్రతి ఒక్కరు మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని కొరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గోపి, ఇన్చార్జి ప్రిన్సిపల్ బుచ్చబ్బాయి, విశ్రాంత హెచ్ఎం లు అప్పారావు, సురేష్, ఇతర అధ్యాపకులు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు వివిధ సంస్కృతి కార్యక్రమంలో నిర్వహించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల అందజేశారు.
విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విలువలు పెంపొందించుకోవాలి
RELATED ARTICLES
