అల్లూరి జిల్లా కొయ్యురు లో మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిట కిట లాడింది.భక్తులు వేకువ జాము నుండే పుణ్య స్నానాలు ఆచరించి శివయ్య కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నసంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ ధర్మకర్త ఎం. వి. వి. స్. ప్రసాద్, ప్రధాన అర్చకులు సాయి శర్మ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
