చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో ఆంజనేయస్వామి, సాయిబాబా దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి, గుర్తు తెలియని ఆగంతకులు దేవుని సొమ్ము పట్టుకు పోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరగగా 30 వేల రూపాయలు నగదు పోయిందని చెబుతున్నారు. తాజాగా బుధవారం రాత్రి సాయిబాబా గుడిలో హుండీ చోరీ చేశారని ఎంత పోయిందో తెలీదు అన్నారు. ఈ మార్కు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే గత కొంత కాలం గా రాత్రివేళల్లో కల్లాల్లో కోళ్లు దొంగతనాలు జరుగుతున్నాయని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు.
