మాడుగుల మండలంలో రీ సర్వే జరిగిన సత్యవరం గ్రామంలో శుక్రవారం రాజమద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు స్థానిక తహసీల్దార్ కే రమాదేవి గురువారం తెలిపారు. మొత్తం 638 రైతులకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా వీటిని అందించనున్నట్టు తెలిపారు. సత్యవరం కమ్యూనిటీ హాల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
