అనకాపల్లి జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం గురువారం వివి రమణ రైతు భారతి కళ్యాణమండపం లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ కంటి ఆసుపత్రి అధ్యక్షులు బుద్ధ రమణాజి నీ వృద్ధుల సంక్షేమ సంఘం ఆయన సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వయా వ్రుధుల ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వయోవృద్ధులకు చేసిన ఉపకారం శూన్యమని, గతంలో వయోవృద్ధులకు రైల్వే రిజర్వేషన్లు రాయితీ తో కూడి రిజర్వేషన్ ఉండేదని, దానిని కరోనా టైములో పూర్తిగా తొలగించి ఇప్పటివరకు ఇవ్వకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్దుల గురించి ప్రత్యేకంగా ఆలోచించి వారికి రైల్వేలో రాయితీలు ఇంకా మరిన్ని వృద్ధులకు సంక్షేమ పథకాలు అమలు చేసేలా చూడాలని . ప్రభుత్వ ఖాళీ స్థలంలో వృద్ధులు ఉండేందుకు విశ్రాంతి భవనo నిర్మించాలని పేర్కొన్నారు.
