మాడుగుల మండల శంకరం పంచాయతీ లో గెడ్డ అవతల ఏడు గ్రామాలకు గోప్పూరు లో రేషన్ స్టాక్ పాయింట్ ఎర్పాటు చేసి రేషన్ మంజూరు చేయాలని గిరిజన సంఘం అద్వర్యంలో మంగళవారం గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం వ్వవసాయ కార్మికసంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న గిరిజన సంఘం నాన్ షేడ్యూల్డ్ ఎరియా జిల్లా కార్యదర్శి ఇరట నరసింహ మూర్తి వ్వవసాయకార్మిక సంఘం జిల్లా ఉపాద్యాక్షులు కె భవానీ తదితరులు మద్దతు పలికి మాట్లాడారు. కోత్తవలస, ఎలం పాడు, గోప్పూరు, తాడి వలస, రాజంపెట,రాయిపాలెం, మామిడిపాలెం గ్రామాలకు చేందిన ఏడు గ్రామాలకు చేందిన గిరిజనులు ఆదివాసులు గెడ్డలు దాటి క్రిష్ణపాలెం వెళ్లి రెషన్ తెచ్చు కోవలసి వస్తుందని తెలిపారు. దీని వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు,రేషన్ తెచ్చుకోవాలంటె కొత్తవలస గెడ్డ తాడివలస గెడ్డదాటి క్రిష్ణంపాలె వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉందన్నారు .
