` పలువురు విద్యా వేత్తల అభినందనలు
ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ (ఐఐఏఎం) డైరెక్టర్ జనరల్, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ అయిన ప్రొఫెసర్ వి. కృష్ణమోహన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ స్కూల్స్ (ఏఐఎంఎస్) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ వైస్-చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇటీవల నిర్వహించిన చాప్టర్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ విద్యావేత్తలు, సంస్థల అధిపతులు మరియు మేనేజ్మెంట్ విద్య నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ విద్యా ప్రమాణాలను పెంపొందించడం, సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది. ప్రొఫెసర్ కృష్ణమోహన్ మేనేజ్మెంట్ విద్య అందించడంలో దŠశాబ్దాల అనుభవం కలిగిన విద్యావేత్తగా, ఉన్నత విద్యా పరిపాలనలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్గా పనిచేసిన కాలంలో ఆయన పరిపాలనా నైపుణ్యం మరియు విద్యా ప్రమాణాల పట్ల నిబద్ధత ప్రత్యేకంగా నిలిచాయి. ఎన్నిక అనంతరం, ఆయన సేవలను గుర్తిస్తూ సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగకర్తలు ఆయన దూరదృష్టి, కట్టుబాటు, సంస్థాగత సంస్కరణలను తీసుకురావడంలో ఆయన సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్ వ్యాపార అవసరాలకు అనుగుణంగా విద్యలో నవీకరణలు, పరిశ్రమ-విద్యాసంస్థల భాగస్వామ్యం, పాఠ్యాంశాల ఆధునీకరణ అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే మేనేజ్మెంట్ విద్యార్థుల్లో నైతిక నాయకత్వాన్ని పెంపొందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చాప్టర్ చైర్మన్ ప్రొఫెసర్ ఎ. ఆదిశేష రెడ్డి, కార్యదర్శి జి. హేమంత్ రెడ్డి మరియు ఇతర సభ్యులు ప్రొఫెసర్ కృష్ణమోహహన్ ను ఘనంగా సత్కరించారు.
ఏఐఎంఎస్ ఏపీ చాప్టర్ వైస్-చైర్మన్గా ప్రొఫెసర్ వి. కృష్ణమోహన్ ఎన్నిక
RELATED ARTICLES
