అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొనడం జరిగింది. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మంత్రి రవీంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ టిడిపి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర డిసిఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ తదితరులు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
RELATED ARTICLES
