విశాఖ టిడిపి కార్యాలయంలో రాష్ట్ర బిల్లింగ్ అండ్ అదర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ను రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు విల్లా రామ్మోహన్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా టిఎన్టియుసి నాయకులు కలిసి ఏడు సంవత్సరాల నుండి మేడే ఉత్సవాలు నిర్వహించడం లేదని శ్రమశక్తి అవార్డ్స్ కూడా ఇవ్వటం లేదు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కార్మిక వర్గాన్ని గుర్తించలేదు ఇప్పటికైనా కుటమి ప్రాంతంలో శ్రమశక్తి అవార్డులు ఇవ్వాలని, విశాఖ స్టీల్ సిటీ ఆర్టీసీ డిపో స్టీల్ ప్లాంటు స్థలంలోనే నడవాలని, విశాఖపట్నం వచ్చే కొత్త సంస్థల్లో స్థానికులకే ఉద్యోగాలు స్థానిక ఎంప్లాయిమెంట్ ద్వారా కల్పించాలని విశాఖపట్నం జిల్లా టిఎన్టియుసి నాయకులకి నామినేటెడ్ పోస్టులు ప్రభుత్వం కల్పించుటకు తగు చర్యలు తీసుకోవాలినని వినత పత్రం ఇవ్వడం జరిగినది. రఘురామరాజు మాట్లాడుతూ వినతి పత్రంలో సమస్యలను టిడిపి అధిష్టానం కి తీసుకువెళ్తానని అన్నారు. టిఎన్టియుసి నాయకులు కొర్రాయి నాగార్జున బలిరెడ్డి సత్యనారాయణ పంచదారల ఉగ్రం శీరంశెట్టి బాబ్జి నాగోతి శివాజీ ఎం కృష్ణ ఉప్పల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర టిఎన్టియుసి అధ్యక్షుడు కు వినతి పత్రం
RELATED ARTICLES
